AP: ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడని మంత్రి లోకేష్ అన్నారు. సుపరిపాలనకు శాశ్వత నమూనా రామరాజ్యమని గుర్తుచేశారు. లోకకల్యాణం కోసం సీతారాముల కల్యాణం కమనీయంగా సాగాలని ప్రార్థించారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పండగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.