TG: రాష్ట్రవ్యాప్తంగా ఎసైన్డ్ భూముల సమస్యను పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీ వేస్తామన్నారు. రాష్ట్రంలో గతంలో పేదలకు సర్కారు ఎసైన్డ్ భూములు ఇచ్చిందని, ఇప్పుడవి 22ఏ నిషేధిత జాబితాలో ఉండటంతో పేదవారు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తామన్నారు.