SKLM: టెక్కలి MLA, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు విజయవాడలో ప్రసిద్ధి గాంచిన ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు .టెక్కలి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.