BPT: బాపట్ల జీబీసి రోడ్డు వద్ద జనసేన సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ఆధ్వర్యంలో సోమవారం ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై అనేకమంది పార్టీలో చేరుతున్నారని, ఈ సభ్యత్వం వల్ల జనసేన నుండి అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిడుగు విజయ మాధురితో పాటు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.