సంస్కృతంలో వాల్మీకి రాసిన రామాయణాన్ని తెలుగులోకి అనువదించి రచించిన ఖ్యాతి కవయిత్రి మొల్లమాంబ దేనని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మొల్లమాంబ జయంతి వేడుకలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ వేడుకలలో ఆమె పాల్గొని మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.