ELR: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. శనివారం భీమడోలు మండలం గుండుగొలను సొసైటీ రైతుసేవాకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈమేరకు సేకరించిన ధాన్యం లోడు లారీని జెండా ఊపి ప్రారంభించారు.