NGKL: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో నాగర్ కర్నూల్ జిల్లాలో రవాణా సేవలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచే విధులను బహిష్కరించిన కార్మికులు, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట డిపోల ముందు ఈరోజు తెల్లవారుజామున నుంచే బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.