GDWL: గద్వాల జిల్లాలోని మంగళవారం రాత్రి వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న రైతులను నిలువునా ముంచేసింది. ప్రభుత్వం కేంద్రాలను ప్రారంభించినా, కొనుగోలు ప్రక్రియలో జాప్యం చేయడం వల్ల ధాన్యం రాశులు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. నేడు.. రేపు అంటూ అధికారులు కాలాన్ని వృథా చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు..