SRD: బొంతపల్లి నుంచి వీరన్న గూడెం వరకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. వర్షాల కారణంగా రోడ్డంతా భారీ గుంతలు పడటంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా పరిశ్రమల ముందున్న గుంతలు ప్రయాణాన్ని నరకప్రాయంగా మార్చాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.