కోనసీమ: జీవో నెంబర్ 77 రద్దు చేయాలని కోరుతూ ఆర్ఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కంటేపల్లి నరేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. 77 జీవో రద్దుచేసి ఫీజు రీయంబర్స్మెంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.