CTR: చిత్తూరులోని అపోలో యునివర్సిటీలో మంగళవారం నిర్వహించిన “వికసిత్ భారత్” కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువశక్తిని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే వికసిత్ భారత్ లక్ష్యమని తెలిపారు.