VSP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అమరావతికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, దాని పేరుతో జరుగుతున్న దోపిడికే వ్యతిరేకమని స్పష్టం చేశారు.