తూ.గో: సీతానగరం మండలం పెదకొండేపూడిలో పులి కదలికలు గురువారం కలకలం రేపాయి. కొండపై ఉన్న పులి చీకటి పడేసరికి చిట్టిబాబాజీ ఆశ్రమం గోశాల వైపు రావడాన్ని ట్రాకింగ్ ద్వారా గుర్తించారు. గోశాలలో 400కు పైగా ఆవులు ఉండటంతో అటవీశాఖ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. దూడను ఎరగా వేసి, మత్తు మందు గన్లతో పులిని బంధించేందుకు బృందం సిద్ధమైంది.