కృష్ణా: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ విధానం అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులుగా ఉండడంతో కంకిపాడు మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ సీనియర్ నేత యలమంచిలి కిషోర్ బాబు శుక్రవారం అన్నారు. కావున సంబంధిత అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి కంకిపాడు మండలంలో గ్యాస్ సిలిండర్ బుకింగ్ విధానాన్ని 25 రోజులకు పెంచాలని తెలిపారు.