ప్రకాశం: కొమరోలు మండలంలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏ.ఈ శ్రీనివాసులు తెలిపారు. నూతన విద్యుత్ లైన్ల నిర్మాణం కారణంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మండలంలోని ఓబులాపురం, మల్లిపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.