SKLM: ఎచ్చెర్ల మండలం షేర్ మహమ్మద్ పురంలో గురువారం రీ సర్వే గ్రామసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్వో గోపాలరావు మాట్లాడుతూ.. రీ సర్వే ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షులు చౌదరి బాబ్జి, డీసీఎంఎస్ ఛైర్మన్ చౌదరి అవినాష్, తదితరులు పాల్గొన్నారు.