PLD: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నూతన నిర్మాణానికి భక్తులు విరాళాలతో ముందుకు వస్తున్నారు. మంగళవారం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అలపర్తి వెంకటేశ్వర్లు, అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడు రూ.1,01,116 నగదును ఆలయ ఈవో నలబోతు మాధవిదేవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.