కోనసీమ: ఈ నెల 27న ఉదయం 10:30 గంటలకు అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధి ఆఫీస్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రముఖ సంస్థల్లో వివిధ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలకు 8978905032 ను సంప్రదించాలన్నారు.