విశాఖ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ గురువారం నిర్వహించారు. త్రీ టౌన్, పెందుర్తి స్టేషన్ల పరిధిలోని ఇళ్లను, వాహనాలను నిశితంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలు నేరాల నియంత్రణకు దోహదపడతాయని పోలీసులు తెలిపారు.