ASR: పాడేరు మండలంలోని కందమామిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను శుక్రవారం ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సందర్శించారు. ముందుగా విద్యార్థులతో ముచ్చటించి, విద్యా, భోజన వసతులపై ఆరా తీసి, భోజనశాలను పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన మెనూ అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.