కోనసీమ: రాజోలు ఎస్సైగా పీ.మల్లికార్జున రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అమలాపురం మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్న మల్లికార్జున రెడ్డి బదిలీపై రాజోలు వచ్చారు. రాజోలు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున రెడ్డిని పోలీస్ స్టేషన్ సిబ్బంది అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని మల్లికార్జున రెడ్డి తెలిపారు.