CTR: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. బుధవారం చిత్తూరు నగరపాలక పరిధిలో 35వ వార్డు కయనికట్టు వీధిలో కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి వృద్ధులకు పింఛన్ సొమ్ములను అందించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.