NDL: టీడీపీ నాయకులు ఈద్గా కూల్చివేతపై ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. ఆదివారం బనగానపల్లెలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మంత్రి బీసీ ఈద్గాను అర్ధరాత్రి కూల్చివేశారని ఆరోపించారు. అన్యాయమని అడగటానికి వెళ్తే తమనే అరెస్ట్ చేయించారని అన్నారు. నిజాలు బయటకు వస్తే టీడీపీ నీచ రాజకీయాలు బయటకు వస్తాయని ఆరోపించారు.