ప్రకాశం మార్కాపురం APTF ఆధ్వర్యంలో ఉద్యోగులు పట్టణంలోని R&B కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ పిఆర్సి , ఐఆర్, యాప్ ల పని భారం తగ్గించి, రాష్ట్రస్థాయి విద్యారంగం ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.