అన్నమయ్య: మదనపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుర్రంకొండ మండలం రెడ్డివారిపల్లికి చెందిన రామాంజులు రోడ్డు దాటుతుండగా, నిమ్మనపల్లె మండలం దివిటివారిపల్లికి చెందిన మంజు, సుదర్శన్ కర్ణాటక నుంచి బైకుపై వస్తూ అతన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురూ గాయపడగా, వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.