విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఛైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ ఆశయాలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని, తద్వారా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.