E.G: వైసీపీ ప్రభుత్వం దళితులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. బుధవారం కాకినాడలో నిర్వహించిన వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పదవులు ఎస్సీలకు కేటాయించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు.