PLD: మంత్రి నారా లోకేశ్కు పల్నాడు ‘యువగళం’ చిత్రపటాన్ని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బహూకరించారు. గురువారం జరిగిన ఈ ఆత్మీయ భేటీలో యువగళం నాటి విశేషాలు, లోకేశ్ తొలిసారి ‘రెడ్ బుక్’ ప్రస్తావన తెచ్చిన అంశంపై వారు చర్చించుకున్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని అప్పట్లో లోకేశ్ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.