VSP: సింహాచలం చందనోత్సవంపై తుది సమీక్ష బుధవారం కలెక్టరేట్లో జరిగింది. ఈ మేరకు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ ఉత్సవాన్ని 12 సెక్టార్లుగా విభజించి, సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. సుమారు 2 లక్షల మంది భక్తులు రానున్న నేపథ్యంలో క్యూలైన్లు, పార్కింగ్, పారిశుద్ధ్యం, తాగునీరు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని చెప్పారు.