W.G: పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో 17వ జాతీయ స్థాయి నాటికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాల కళాకారులు ప్రతిభను ప్రదర్శించనున్నారని అధ్యక్షుడు కేవీ కృష్ణ వర్మ తెలిపారు. తొలిరోజు ‘మంచి మనసులు’, ‘దేవుణ్ణి చూశా’ నాటికలు అలరించాయి. 15న ముగింపు సభ, బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.