తిరుమలలో పోటెత్తిన భక్తుల రద్దీ కొనసాగుతోంది. నాలుగు రోజులుగా వరుస సెలవులు రావడంతో ఒక్కసారిగా యాత్రికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. గదులు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది భక్తులు ఆలయం పరిసర ప్రాంతాల్లోనే రాత్రి సేద తీరారు.