GNTR: పెదకాకానిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కనీస వేతనం చెల్లించాలని, గత సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.