కృష్ణా: పెడనలో శుక్రవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బషీర్ తెలిపిన వివరాల ప్రకారం.. 19వ వార్డు గృహ సముదాయాల మధ్య నిర్వహిస్తున్న జూదంపై దాడి చేసి నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.47,750 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.