KKD: పిఠాపురం ఆర్ఆర్బీహెన్ఆర్ క్రీడా మైదానంలో రేపు ఉమ్మడి తూ.గో. జిల్లా స్థాయి పురుషుల, మహిళల రగ్బీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ నిర్వహక కార్యదర్శి లక్ష్మణరావు తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడిస్తూ.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ వివరాలతో హాజరు కావాలన్నారు.