KRNL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఇవాళ బీఎస్పీ నేత గాడి అరుణ్ కుమార్ ఆరోపించారు. పలుచోట్ల బంకుల్లో “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే బంకులను సీజ్ చేయాలని అధికారులను కోరారు.