KRNL: ఆదోనిలో SERP ఆధ్వర్యంలో శనివారం VOAలకు స్మార్ట్ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, MLA పార్థసారధి, టీడీపీ నేత దేవేంద్రప్ప ముఖ్య అతిథులుగా పాల్గొని ఫోన్లు అందజేశారు. స్మార్ట్ఫోన్లతో సేవలు వేగవంతమై పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.