నెల్లూరులోని సరస్వతి నగర్కు చెందిన జాను మద్యానికి బానిసయ్యాడు. అన్నం తినకుండా ఎక్కువగా మద్యం తాగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఎఫ్సీఐ కాలనీ సెంటర్ వద్ద పడిపోయి మరణించాడని మృతుడి చెల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. మృతుని భార్య సౌదీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.