VSP: నంద్యాలలో ఏప్రిల్ 17 నుంచి 19 వరకు సీఐటీయూ 17వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్ తెలిపారు. ఈమేరకు గురువారం జగదంబ సీఐటీయూ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. విశాఖ నుంచి 60 మంది ప్రతినిధులు హాజరవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 650 మంది పాల్గొంటారని పేర్కొన్నారు.