KDP: లింగాల నుంచి ఉదయాన్నే వెళ్లే మొదటి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం గ్రామస్థులు, విద్యార్థులు, కూలీలు, ఉద్యోగస్థులు ప్రయాణాలు సాగిస్తుంటారు. దీంతో ఆ బస్సులో అడుగు తీసి అడుగు పెట్టాలంటే కష్టంగా మారిందన్నారు. RTC DM స్పందించి ప్రయాణికుల అవస్థలను గమనించి అదనపు బస్సును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.