ATP: తాడిపత్రిలోని 32వ వార్డు బిందెల కాలనీలో ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అక్కడికక్కడే మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజల ఇబ్బందుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.