CTR: పుంగనూరు పట్టణం అంబేద్కర్ కూడలిలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు విరుపాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం సీఐ సుబ్బరాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల నుంచి పట్టణానికి నిత్యం ఎంతోమంది వచ్చి వెళ్తూ ఉంటారని, వేసవిలో వారు త్రాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.