VZM: రైతన్నల భూ సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పేర్కొన్నారు. సోమవారం నెల్లిమర్ల మండలం ధనానపేటలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మీ భూమి-మీ హక్కు”కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.