ATP: రాయదుర్గం మండలం డీ.కొండాపురం గ్రామంలో రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పంపిణీ చేశారు. రైతుల భూ హక్కులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పుస్తకాలు పారదర్శకతకు ప్రతీకగా నిలుస్తాయని, ప్రతి రైతుకు చట్టబద్ధమైన రక్షణ అందించేలా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.