వేసవిలో మండే ఎండలతో శరీరం త్వరగా శక్తిని కోల్పోతుంది. దీంతో బాడీ నిరసంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో శీతల పానియాలు, కొబ్బరి నీళ్లు తీసుకుంటారు. వాటితో పాటు పుచ్చకాయ, నారింజ పండ్లు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటి ద్వారా శరీరానికి మంచి హైడ్రేషన్ అందుతుంది. కీరదోస, అనాసపండు , స్ట్రాబెర్రీలు కూడా తక్షణ శక్తినిస్తాయని చెబుతున్నారు.