బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ సాంకేతిక సమాచార కేంద్రం నూతన భవనాన్ని ఆచార్య ఎన్.జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. ఆర్. శారద జయలక్ష్మి దేవి ప్రారంభించారు. భవనంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాలు, ఛాయాచిత్రాలు, విద్యార్థులు రూపొందించిన నమూనాలు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై స్పష్టమైన అవగాహన కల్పిస్తాయని తెలిపారు.