KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్లు పాడా పీడీ భవాని శంకర్ ఆదివారం తెలిపారు. అనివార్య కారణాల వల్ల 23వ తేదీన ఈ వేదిక నిర్వహించడం లేదని పేర్కొన్నారు. అర్జీదారులు, అధికారులు ఈ మార్పును గమనించాలని సూచించారు. 1100 కాల్ సెంటర్ ద్వారా తమ అర్జీలను అందజేయవచ్చని భవాని శంకర్ వివరించారు.