NTR: కొండపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు హాజరై పూలే, మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భావితరాలకు మార్గదర్శి అయిన పూలే చూపిన వెలుగుబాటలో మనమంతా పయనిద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.