ATP: ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు లభించిన సందర్భంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ సంస్థ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురంలోని ఆర్డీటీ కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో ఆర్డీటీ సేవలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.