కోనసీమ: యానాంలో శ్రీ భూ సమేత మీసాల వేంకటేశ్వర స్వామి రథోత్సవం సోమవారం అత్యంత వేడుకగా జరగనుంది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయం నుంచి న్యూ బస్టాండ్ వరకు స్వామివారి రథయాత్ర సాగనుంది. మీసాలతో దర్శనమిచ్చే స్వామివారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు