బాపట్ల మండలం మున్నంగివారి పాలెంలో గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ల మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకుని కాయ కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.